బావ ఇంటిని దోచేసిన బావమరిది.. 85 లక్షలతో పరార్..

-

క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడిన ఓ వ్యక్తి ఏకంగా బావ ఇంట్లోనే దొంగతనానికి తెగబడ్డాడు.డూప్లికేట్ తాళంచెవి చేయించి , ఎవరూ లేని సమయంలో చోరీ చేశాడు.మొత్తం రూ. 85 లక్షలు తీసుకొని ఉడాయించాడు.చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే భూమారాం అనే వ్యాపారి ఇంట్లోనే బట్టలు, బంగారం వ్యాపారం చేస్తున్నాడు.బ్యాంక్ హాలిడే వల్ల ఇంట్లో రూ.85 లక్షలు ఉంచారు.వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్ళాడు.విషయం తెలుసుకున్న అతనువిషయం తెలుసుకున్న అతని బావమరిది హర్యానా నుంచి ట్రైన్ లో హైదరాబాద్ కి వచ్చాడు.

డూప్లికేట్ తాళంచెవి సహాయంతో డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించాడు.ఓ గదిలో బ్యాగులో ఉంచిన నగదును చోరీ చేసి అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు.భూమారాం ఇంటికి వచ్చి చూసేసరికి, దొంగతనం జరిగింది అన్న విషయాన్ని గుర్తించాడు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.ఈ క్రమంలో ఈ నెల 20న నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news