కొత్త రూల్స్ ప్రకటించిన BCCI. ఇకపై టీమ్ లో 11 మంది కాదు.. 15 మంది!

-

బీసీసీఐ ఓ కొత్త రూల్ ను తీసుకురాబోతుంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. అయితే ఈ నియమం క్రికెట్ కు కొత్త కావచ్చు. కానీ ప్రపంచంలో పాపులర్ అయిన ఫుట్ బాల్, రగిబి, బాస్కెట్ బాల్ ఇలా అన్ని గేమ్స్ లో అది ఉంది.

అయితే ఈ నియమం ప్రకారం ఆట మధ్యలో అంటే 14 ఓవర్లు పూర్తికాకముందు, జట్టులో ఒక్క మార్పు అనేది చేయవచ్చు. ఆటకు ముందుగా ప్రకటించిన జట్టులో నుండి ఒక్క ఆటగాడిని బయటకు పంపించి, మరో ఆటగాడిని మ్యాచ్ లోకి తీసుకోవచ్చు.

అయితే ఈ నియమం బ్యాటింగ్, బౌలింగ్ రెండు సమయాల్లో పనిచేస్తుంది. అయితే మ్యాచ్ మధ్యలో బయటకు వచ్చిన ఆటగాడు మళ్ళీ ఇక గ్రౌండ్ లోకి రావడానికి వీలు ఉండదు. కనీసం సబ్సిట్యూట్ ఆటగాడిగా కూడా ఉండకూడదు. అయితే దీనిని మొదట మన దేశవాలి టోర్నీలో తీసుకురాబోతుంది. అక్కడ ఇది పనిచేస్తే, వచ్చే ఐపీఎల్ 2023 లో అమలులోకి తెచ్చే అవకాశం అనేది ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news