కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం : భట్టి

-

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్‌లో పలువురు చేరారు. అయితే ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ మీద బీజేపీ దండయాత్ర చేసిందని, తెలంగాణ ఇచ్చేటప్పుడు.. ఇచ్చిన తర్వాత కూడా మోడీ తెలంగాణ అవమాన పరిచారన్నారు. బీజేపీకి ఏం చేసిందని ఓట్లు వేయాలని, 8 ఏండ్లుగా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. కార్యకర్తల బలంతోనే నేడు పార్టీ నిలబడిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని భట్టి పిలుపునిచ్చారు. బీజేపీ మూడు రోజుల పాటు సమావేశాలు పెట్టుకుందని, విభజన చట్టంలో హామీలు చేస్తారు అని అనుకున్నామన్నారు. కేసీఆర్‌.. ఏమయ్యా పెద్దమనిషి బీజేపీతో యుద్ధం అన్నావు.. మూడు రోజులు ఏం చేశావు.. తెలంగాణ లో దండయాత్ర చేస్తా అంటే…దగ్గర ఉండి పోలీసుల రక్షణ ఇచ్చి ఏర్పాట్లు చేశావు.. మోడీని ఎందుకు ప్రశ్నించలేదు కేసీఆర్‌ అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version