BHEEMLA NAYAK : భీమ్లా నాయక్ నాలుగో సింగిల్ ముహుర్తం ఫిక్స్.. ఇక పవన్ ఫ్యాన్స్ కు జాతరే !

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా ప్రధాన పాత్రలుగా భీమ్లా నాయక్‌ సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. సాగర్‌ కే చంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తుండగా… పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే కిరణ్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన.. పోస్టర్లు, టీజర్లు మరియు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా ఫోర్త్‌ లింగిల్‌ కు ముహుర్తం ఖరారు చేసింది చిత్ర బృందం. ”అడవి తల్లి మాట ” అనే లిరిక్స్‌ తో ప్రారంభం అయ్యే ఈ సాంగ్‌ ను డిసెంబర్‌ 1 వ తేదీన… ఉదయం 10.08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో పవన్‌ ఫ్యాన్‌ లో ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version