గుజరాత్ పురుగు తెలంగాణకు వచ్చింది… మందులేసి చావగొట్టాలి- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

-

రైతుల సమస్యలపై బండి సంజయ్ చేపట్టిన జిల్లాల పర్యటన రసాభాస అవుతోంది. బండి సంజయ్, కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఏం చేసిందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. గుజరాత్ పురుగు తెలంగాణకు వచ్చిందని.. మందులేసి చావగొట్టాలని బీజేపీని ఉద్దేశించి విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లా అర్జాల బావి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివ్రుద్ధి సాధ్యమవుతోందని ఆయన అన్నారు.

Kancharla Bhopal Reddy

రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని.. .వ్యవసాయాన్ని పండగలా మార్చారని కొనియాడారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వ కుట్రలు పన్ని రైతుల బోర్లకు మీటర్లు పెట్టి.. సంవత్సరానికి రూ.30 వేలు డబ్బులు దోచుకుందామని చూస్తే కేసీఆర్ అడ్డు పడ్డారని అన్నారు. కేసీఆర్ మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోనందుకే యాసంగిలో వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు.  బీజేపీ ప్రభుత్వం రైతుల్ని ఏడిపిస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news