Alert : నేటి పదో తరగతి పరీక్షపై విద్యార్థులకు కీలక సూచన

-

తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలెర్ట్. పదో తరగతి విద్యార్థులకు నేడు సైన్స్ పరీక్ష జరగనుంది. అయితే ఈ సైన్స్ పరీక్షలో పలు మార్పులు చేసింది టెన్త్ బోర్డు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షను ఒకేరోజు వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది విద్య శాఖ.

ఇందులో భాగంగానే ఉదయం 9:30 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఫిజికల్ సైన్స్ నిర్వహించనున్నారు. ఇక ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 20 నిమిషాల మధ్య బ్రేక్ ఉంటుంది. ఆ సమయంలో విద్యార్థులు పరీక్షా కేవలం నుంచి బయటకు వెళ్లకూడదు. అనంతరం 11:20 నుంచి 12 50 గంటల వరకు బయలజీ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ మరియు సమాధాన పత్రాలు జాగ్రత్తగా ట్యాగ్ చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version