ఈటెల రాజేందర్ భూముల ఆక్రమణ కేసు లో బిగ్ ట్విస్ట్!

-

బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూముల ఆక్రమణ కేసు లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీం పేటలో అసైన్డ్ భూములు ఆక్రమణల ఆరోపణలపై మరి కాసేపట్లో భూముల సర్వే ప్రారంభం కానుంది. బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులు జమున హెచ్ రీస్ సంస్థ లో అస్సాన్డ్ ల్యాండ్ పై విచారణ జరుగనుంది.

బిజేపి ఎమ్మెల్యే ఈటెల సతీమణి, కొడుకు జమున సంస్థ కు సంబంధించిన సభ్యులు న్యాయ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సర్వే ల్యాండ్ రెవిన్యూ జిల్లా అధికారులు నోటీసీలు ఇచ్చారు. అచ్చంపేట లో 157 మంది కి సంబంధించిన అస్సాన్డ్ ల్యాండ్ కొనుగోలు అమ్మకాలు జరిపినట్లు రికార్డులను పరిశీలించారు అధికారులు. అమ్మిన వారు కొన్న వారు విధిగా హాజరై అధికారుల ముందు ల్యాండ్ కు సంబంధించిన పత్రాలు ఆధార్ పాస్ పుస్తకం తో వచ్చి సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఈ సర్వే నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news