LIGER : లైగర్ నుంచి బిగ్ అప్డేట్..ఇక దేవరకొండ ఫాన్స్ కు జాతరే

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్‌ పనిలో పడింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

అయితే తాజాగా లైగర్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల చెప్పినట్లుగానే ఈ సినిమా నుంచి బెస్ట్ స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ స్టిల్స్ లో విజయ్ దేవరకొండ కెమెరా పట్టుకొని… అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ చెప్పే కథ వింటూ విజయ్ దేవరకొండ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా రేపు ఉదయం పది గంటల సమయంలో లైగర్ సినిమా నుంచి ఫస్ట్ గేమ్స్ విడుదల చేయనుంది చిత్రబృందం.

Read more RELATED
Recommended to you

Latest news