పవన్‌ కళ్యాణ్‌ ను ఘోరంగా అవమానించిన బీజేపీ !

-

పవన్‌ కళ్యాణ్‌ ను ఘోరంగా అవమానించింది బీజేపీ. ప్రధాని మోడీ రేపు భీమవరం పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్ విశ్వ భూషణ్, సీఎం జగన్. గన్నవరం నుండి భీమవరంకు ఒకే హెలికాప్టర్లో ప్రయాణం చేయనున్నారు ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి జగన్‌. అలాగే… ప్రధాని మోడీ కాకుండా వేదిక పై ఎనిమిది మందికి చోటు కల్పించింది బీజేపీ.

గవర్నర్ విశ్వ భూషణ్, సీఎం జగన్. కిషన్ రెడ్డి, చిరంజీవి, పురంధరేశ్వరి, సోము వీర్రాజు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు ప్రధానితో పాటు వేదిక పంచుకోనున్నారు.

పీఎంవో అధికారిక షెడ్యూల్లో స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరు కనిపించలేదు. టీడీపీ నుంచి ప్రధాని బహిరంగ సభ కార్యక్రమానికిజిల్లా ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు హాజరు కానున్నారు. అలాగే… జనసేన నేతల పేర్లు మాత్రం ఎక్కడా ప్రస్తావన లేదు. గన్నవరం విమానాశ్రయం, భీమవరం హెలిపాడ్, పబ్లిక్ మీటింగ్ ప్రాంతాల్లో ప్రధానికి స్వాగతం పలుకనున్నారు పలువురు బీజేపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news