నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత కే.లక్ష్మణ్.. మరో 8 మంది..!!

-

బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మంగళవారం రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు గానూ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనతోపాటు బీజేపీ పార్టీకి చెందిన ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్, సీనియర్ నేత కౌశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు ఉన్నారు.

బీజేపీ సీనియర్ నేత కే.లక్ష్మణ్
బీజేపీ సీనియర్ నేత కే.లక్ష్మణ్

కాగా, బీజేపీ నేత కే.లక్ష్మణ్‌తో పాటు లక్ష్మీకాంత్ వాజ్‌పేయీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్, మితిలేశ్ కుమార్, సురేంద్ర సింగ్ నాగర్, దర్శన్ సింగ్, బూబూ రామ్ నిషాద్, సంగీత యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 11 రాజ్యసభ సీట్లకు నామిషన్లు దాఖలు చేయడానికి నేడే ఆఖరి రోజు. అయితే గతంలో కే.లక్ష్మణ్ తెలంగాణలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news