కేసీఆర్ పై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

-

ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని, తనను మాత్రం పాత వాహనంతోనే సరిపెట్టుకోవాలంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. చస్తే ఎంత? బతికితే ఎంత? అని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ దృష్టిలో తన ప్రాణాలకు ఏమాత్రం విలువలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని, తనను మాత్రం పాత వాహనంతోనే సరిపెట్టుకోవాలంటున్నారని తెలిపారు.

ఒకవేళ ఆ వాహనంలో తిరిగితే ఎక్కడ ఆగిపోతుందో అని ఆందోళన కలుగుతోందని తెలిపారు. ఈ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు గతంలోనే లేఖ రాశానని, కానీ వారు పాత వాహనానికి మరమ్మతులు చేసి తిరిగి తన వద్దకు పంపించారని రాజాసింగ్ వెల్లడించారు. ఈ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం పదేపదే మొరాయిస్తోందని, ఆ వాహనంలో తిరగకపోతే మాత్రం నోటీసులు పంపిస్తున్నారని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version