ఎన్టీఆర్‌ పేరు కాదు… జిన్నా టవర్ పేరు మార్చాలి – ఏపీ బీజేపీ

-

ఎన్టీఆర్‌ పేరు కాదు.. జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. గుంటూరులో తాజాగా మీడియాతో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడారు. అమరావతికి నమ్మక ద్రోహం చేశారని.. హైకోర్టు తరలించాలన్న ప్రయత్నమే చేయడం లేదని ఫైర్‌ అయ్యారు.

సిఎం ఒక్క ఉత్తరం కూడా రాయలేకపోతున్నారని.. రైతుల పాదయాత్రను దండయాత్ర అంటూ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో వారి అవినీతి బయటపడుతుందని తప్పుదోవ పట్టిస్తున్నారని.. పొలిటికల్ ఇమ్మెచ్యూర్ అంటేనే రాహూల్ గాంధీ అని చురకలు అంటించారు. ఎన్టీఆర్ పేరు మార్చి వితండవాదం చేస్తున్నారని ఆగ్రహించారు.

సిఎం తన గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని దాచిపెట్టి ఎమ్మెల్యేలపై నెపం మోపుతున్నారని.. కేంద్రం ఇచ్చిన ఇళ్ళను పూర్తి చేయకుండా రాష్ట్రం తాత్సారం చేస్తుందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఉత్తుత్తి సమీక్షలు చేస్తున్నారు.. అరవై శాతం మాత్రమే ఈ క్రాప్ పూర్తయిందన్నారు. ఈ క్రాప్ చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని.. లెక్కకు మించి వైఫల్యాలున్నాయని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news