జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు.. రేపు బీజేవైఎం రాస్తారోకో

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం బీజేవైఎం కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నారు. కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై, అమ్మాయిలపై వరుసగా  రుగుతున్నఅఘాయిత్యాలు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

BJYM leaders staged protest against making education a business

బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు.. వారి కుమారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసును నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు… మహిళలు, అమ్మాయిల భద్రత విషయంపై ఆందోళన కలిగిస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news