నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ వ్యాఖ్యలపై ఖతార్‌ ప్రభుత్వం సీరియస్‌

-

నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వ్యవహారం ముదురుతోంది. వారు చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం తమ దేశంలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. దీనిపై భారత రాయబారి దీపక్ మిట్టల్ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదని, ఆ ట్వీట్లు భారత ప్రభుత్వ మనోభావాలను ప్రతిబింబించేవిగా భావించరాదని స్పష్టం చేశారు.

ఆ వ్యాఖ్యలు బాహ్య శక్తుల పనే అని ఓ సందేశంలో ఉద్ఘాటించారు. నాగరికత వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం, బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా భారత కేంద్ర ప్రభుత్వం అన్ని మతాలకు సర్వోన్నత గౌరవం ఇస్తుందని వివరించారు. ఆ వ్యాఖ్యలు చేసినవారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అని దీపక్ మిట్టల్ పేర్కొన్నారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ల ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. నుపుర్ శర్మ ఇటీవల మహ్మద్ ప్రవక్తపై ఓ టీవీ చాన్ డిబేట్ లో వ్యాఖ్యలు చేయగా, మహ్మద్ ప్రవక్తపై నవీన్ జిందాల్ కొన్ని ట్వీట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news