Breaking: మరోసారి వాయిదాపడ్డ అలియా- రణబీర్ పెళ్లి.

-

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే గప్ చుప్ గా పెళ్లి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న వీరిద్దరి పెళ్లికి పెద్దల అనుమతి కూడా లభించింది. గతేడాదే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే మరోసారి అలియా- రణబీర్ పెళ్లి వాయిదా పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి విషయమే. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జంట ముందుగా 14వ తేదీన పెళ్ళాడనున్నట్లు వార్తలు వినవచ్చాయి. అయితే ఈ పెళ్ళి వాయిదా పడబోతున్నట్లు సమాచారం. దానికి కారణం భద్రతాపరమైన ఆందోళన అని వినిపిస్తోంది. నిజానికి పెళ్ళి విషయం లీక్ కాగానే భద్రతపై దృష్టిసారించారు. ఇప్పుడు అదే కారణంతో వాయిదా కూడా వేస్తున్నారట. మరోవైపు ఈ పెళ్ళి వచ్చేవారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని అంటున్నారు. ఇదే విషయమై రణబీర్ తల్లి నీతూ కపూర్ ఓ సినిమా సెట్స్‌లో మీడియాతో మాట్లాడుతూ తనకు తెలియదని, ఎప్పుడు జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news