FLASH : హైదరాబాద్ లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు..!

-

భారీ పేలుడుతో హైదరాబాద్ మహా నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని బాచుపల్లిలో గల విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల సమీపంలో గురువారం సాయంత్రం వాసవి భవన నిర్మాణ సంస్థ చేపట్టిన ఓ భవన నిర్మాణం పునాదుల తవ్వకం కోసం బాంబులతో బ్లాస్ట్ చేయగా ఈ భారీగా పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఉన్న చైతన్య కళాశాల, విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన నాలుగు బస్సులు, రెండు కార్ల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అలాగే హాస్టల్ భవనం అద్దాలు పగిలిపోయాయి. భారీ బ్లాస్టింగ్‌ వల్ల పెద్ద సైజు బండరాళ్లు చాలా దూరం ఎగిరిపడ్డాయి. దీంతో  కొంచం దూరంలో ఉన్న ఫర్నిచర్ షాపు సైతం ధ్వంసమైంది. కరోనా కారణంగా కళాశాలలు మూసి ఉండడంతో భారీగా ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సమీపంలోని వ్యక్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news