ఐపీఎల్ 2023: ట్రెంట్ బౌల్ట్ షాక్ కు ఢిల్లీ బెంబేలు… మొదటి ఓవర్లోనే 2 వికెట్లు !

-

200 పరుగుల భారీ అలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి మొదటి ఓవర్ లోనే అదిరిపోయే షాక్ ఇచ్చాడు ట్రెంట్ బౌల్ట్. తుది జట్టులోకి తీసుకోని పృథ్వీ షా ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉంచుకుంది, ఛేదనలో ఖలీల్ అహ్మద్ కు బదులుగా పృథ్వీ షా ను తీసుకుంది. అయితే ఈ పాచిక ఢిల్లీకి పారలేదు అని చెప్పాలి. వరుసగా రెండు గేమ్ లలోనూ విఫలమైన పృథ్వీ షా ఈ మ్యాచ్ లోనూ తాను ఎదుర్కొన్న మొదటి ఓవర్ మూడవ బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో సంజు శాంసన్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు డక్ అవుట్ గా వెనుతిరిగాడు.

దీనితో పృథ్వీ షాకు ఇక ఛాన్స్ దక్కడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ తో తుది జట్టులో చోటు దక్కించుకున్న మనీష్ పాండే , బౌల్ట్ వేసిన తరువాత బంతికే ఎల్ బి డబ్ల్యు గా అవుట్ అయ్యాడు. దీనికి రివ్యూ తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అలా మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి ఢిల్లీ కి బిగ్ షాక్ ఇచ్చాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news