BREAKING: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి అస్వస్థత

-

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అస్వస్థతకు గురయ్యారు. బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన సిలుగురి వద్ద స్టేజ్ పై ఉండగానే అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకి వైద్యం కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రధాని మోదీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Nitin Gadkari

కాగా సిలిగుడ లోని సేవక్ కంటోన్మెంట్ పరిధిలో నాలుగు వరసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు నితిన్ గట్కరి వచ్చారు. వేదికపై ఉన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేశారు. పక్కనే ఉన్న ఓ విశ్రాంతి గతిలోకి తీసుకువెళ్లగా ఆయన మరింత అసౌకర్యానికి గురికావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news