Breaking : బల్లార్ష రైల్వే జంక్షన్‌లో ప్రమాదం.. పలువురికి గాయాలు

-

మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పురాతన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధ్యలో కొంత భాగం కుప్పకూలింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా బల్లార్ష రైల్వే జంక్షన్‌ వద్ద ఒక్కసారిగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి స్లాబులు కూలిపోయాయి. ఈ ఘటన సమయంలో బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటన సమాచారం అందగానే స్థానిక అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Foot over bridge collapses at Balharshah railway station in Maha's  Chandrapur; 4 injured | India News

స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వంతెన కూలిపోవడంతో పెద్దశబ్ధం రావడంతో ప్లాట్‌ఫ్లామ్‌పైన ఉన్న ప్రయాణికులందరూ భయంతో పరుగుతీశారు. కాగా, ఈ ఘటనలో 20 గాయపడినట్టు సమాచారం. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news