రిచ్ లిస్ట్ లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల జంట

-

బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి బ్రిటన్ చరిత్రలోనే అత్యంత సంపన్న ప్రధానమంత్రి దంపతులుగా రికార్డు సృష్టించారు.సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ‘సండే టైమ్‌ రిచ్‌ లిస్ట్‌’లో స్థానం దక్కించుకున్న ఈ దంపతుల సంపద 2024 ర్యాంకింగ్స్‌లో మరింత పెరిగింది. ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ షేర్ల కారణంగానే వీరి ఆదాయం భారీగా పెరిగింది.ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతామూర్తి ఆస్తి 150 మిలియన్ పౌండ్లు పెరిగి 651 మిలియన్ పౌండ్లకు చేరిందని సండే టైమ్స్ పేర్కొంది. గత ఏడాది 275వ స్థానంలో ఉన్న ఈ దంపతులు ఈ ఏడాది 245వ ర్యాంకుకు ఎగబాకారు. అక్షతామూర్తి సంపాదన ఆమె భర్త కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

2022-23లో రిషి సునాక్ రూ. 2.2 మిలియన్ పౌండ్ల సంపాదనను కలిగి ఉంటే, గతేడాది అక్షతా మూర్తి సంపద 13 మిలియన్ పౌండ్లుగా ఉంది. వీరిద్దరి అత్యధిక సంపదకు ఇన్ఫోసిస్‌లో అక్షతామూర్తికి ఉన్న వాటాయే కారణం. UKలో 2022లో 177గా ఉన్న బిలియనర్ల సంఖ్య ఈ ఏడాది 165కి తగ్గిందని తెలిపింది. ధనవంతుల లిస్టులో బిజినెస్మ్యన్ గోపీ హిందూజా £37.2bn సంపాదనతో టాప్లో ఉన్నారని వెల్లడించింది. పాల్ మెక్కార్ట్నీ £1bn నికర విలువతో బిలియనీర్ అయిన తొలి UK మ్యుజీషియన్గా నిలిచారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version