సీఎం జగన్ కు షాక్.. ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ?

-

విజయవాడ : బ్రదర్ అనిల్ ఆధ్వర్యంలో విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో బిసి మైనార్టీ క్రిస్టియన్ సంఘాలు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ సంఘం నాయకులు శోంఠి నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రదర్ అనిల్ వచ్చి మాతో సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల అప్పట్లో మేము ఓటు వేసి వైసీపీని గెలిపించామని… కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం అవసరమని బ్రదర్ అనిల్ కు చెప్పామని.. దీనిపై సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకుంటామని అనిల్ చెప్పారన్నారు బీసీ వెల్ఫేర్ సంఘం నాయకులు శోంఠి నాగరాజు. 2019 ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కుమార్ వైఎస్. జగన్ ను గెలిపించారు..ఈ రోజు కష్ట పడి పని చేసిన కార్యకర్తలకు జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. బ్రదర్ అనిల్ ఏపీలో రాజకీయ పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు బీసీ వెల్ఫేర్ సంఘం నాయకులు శోంఠి నాగరాజు.

Read more RELATED
Recommended to you

Latest news