టీమిండియాకు షాక్…శ్రీలంక సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రా దూరం

-

టీమిండియాకు బిగ్‌ షాక్ తగిలింది. శ్రీలంక సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. అంతర్జాతీయ పునరాగమనం కోసం టీమిండియా స్టార్ పెసర్ జస్ప్రీత్ బుమ్రా మరికొంత కాలం ఆగక తప్పేలా లేదు. శ్రీలంకతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రాకు తోలుతా స్థానం కల్పించారు.

అయితే, అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వన్డే సిరీస్ నుంచి తప్పించారు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా గతేడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీంతో బుమ్రా లేకుండానే శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ లు ఆడనుంది టీమిండియా. కాగా ఇవాళ ఇండియా, శ్రీలంక వన్డే మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news