కోలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ న‌య‌న్, విగ్నేష్‌ల‌పై కేసు న‌మోదు!

-

ప్ర‌స్తుతం కోలీవుడ్ లో పెళ్లి చేసుకోకున్నా.. హాట్ కపుల్స్ అనే పేరు తెచ్చుకున్న న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్.. ఇటీవ‌ల సొంతంగా సినీ నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ సినీ నిర్మాణ సంస్థ‌కు రౌడీ పిక్చ‌ర్స్ అనే పేరును కూడా పెట్టారు. కాగ ఈ పేరు త‌మిళ‌నాడులో తాజా గా వివాదం చోటు చేసుకుంది. ఈ రౌడీ పిక్చ‌ర్స్ నిర్మాణ సంస్థ‌ను బ్యాన్ చేయాల‌ని క‌ణ్ణ‌న్ అనే సోషలిస్ట్ డిమాండ్ చేస్తున్నాడు.

అంతే కాకుండా.. న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని చెన్నై పోలీస్ క‌మిషన‌ర్ కార్యాల‌యంలో ఫిర్యాదు కూడా చేశారు. కాగ త‌మిళ‌నాడులో ఇటీవ‌ల ప్ర‌భుత్వం.. రౌడీల‌ను అణ‌చివేసింద‌ని ఫిర్యాదు దారుడు తెలిపారు. కానీ న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ కలిసి మ‌రో సారి రౌడీల‌ను ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. కాగ ఇటీవల రౌడీ పిక్చ‌ర్స్ నిర్మాణ సంస్థ‌.. అజిత్ సినిమా నిర్మించ‌డం ఫిక్స్ అయింది.

కాగ దీన్ని సెల‌బ్రెట్ చేసుకోవ‌డానికి రౌడీ పిక్చ‌ర్స్ భారీ స్థాయిలో ట‌పాకాయాలు కాల్చ‌ర‌ని.. ఇది ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేలా ఉంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాగ పోలీసులు.. ఈ ఫిర్యాదుపై విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. కాగ దీని పై న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news