తారకరత్న మృతి పై సెలబ్రిటీల సంతాపం..!

-

గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నందమూరి తారకరత్న నిన్న రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.. ఇకపోతే నందమూరి తారకరత్న మృతి పై పలువురు సెలబ్రిటీలు కూడా సంతాపం ట్విట్టర్ల ద్వారా ట్వీట్ చేయడం జరిగింది.. ఇకపోతే తారకరత్న మరణించారన్న విషాద సమయంలో చిరంజీవి , పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమంది సంతాపం తెలియజేస్తూ..

చిరంజీవి..
తారకరత్న మరణ వార్తతో తీవ్ర విషాదంలో కూరుకు పోయాను .. తేజస్సు , ప్రతిభావంతుడు, ఆప్యాయత కురిపించే ఆయన ఇక లేరంటే నమ్మశక్యంగా లేదు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది.. ఆయన మరణ వార్త వినగానే గుండె ముక్కలైనంత పని అయింది.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని కోరుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్..
నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం చాలా బాధాకరం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకుంటారని భావించాను .. ఆయన నటుడుగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు.. ఆ ఆశలు నెరవేరకుండానే తుది శ్వాస విడవటం దురదృష్టకరం.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మహేష్ బాబు..
తారకరత్న మరణం నాకు దిగ్బ్రాంతికి , విషాదానికి గురి చేసింది, నా సోదరుడు చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతారని ఊహించలేదు.. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ మహేష్ బాబు తెలిపారు.

రవితేజ..
మృత్యుతో పోరాటం చేస్తూ తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోయారనే వార్త నన్ను తీరని విషాదంలోకి నెట్టింది. సహృదయులైన ఆయన నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రవితేజ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలకు కూడా తారకరత్న మరణం పై సంతాపం తెలియజేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news