విధి మరోలా తలచింది..తారకరత్న మృతిపై విజయసాయిరెడ్డి ఎమోషనల్

-

విధి మరోలా తలచింది..తారకరత్న మృతిపై విజయసాయిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(40) గత 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ శనివారం రోజున కన్నుమూశారు. ఇవాళ తారక్ భౌతిక కాయాన్ని బెంగళూర్ నుంచి హైదరబాద్ తరలించనున్నారు. ఇవాళే తారక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తారక్ మృతి తో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీనిపై విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్‌ చేశారు విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news