కేంద్రం తెలంగాణకి 12 వేలకోట్ల నిధులు రాకుండా ఆపింది – హరీష్ రావు

-

బోరు బావుల వద్ద మీటర్లు పెట్టలేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే 12 వేల కోట్ల రూపాయలను కేంద్రం ఆపిందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోరు బావుల కాడ మీటర్లు మాట నిజం కాకుంటే 12 వేల కోట్లు ఆపిన దానికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతులకు పంటకు 5000 అందించి పెట్టుబడి సహాయం చేసింది టిఆర్ఎస్ ఘనత కాదా? పని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణ తరహా రైతుబంధు ఇస్తున్నారో దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుంది నిజం కాదా అని ప్రశ్నించారు. బిజెపి చేసింది ఏమన్నా ఉందా అంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news