హత్య చేయబడిన టీడీపీ కార్యకర్త “పాడె మోసిన” చంద్రబాబు.

-

గుంటూర్ జిల్లా మాచర్ల నియోజకవర్గంబలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత హత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలంలో గుండ్లపాడు గ్రామ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చెంపేసిన విషయం తెలిసింది. అయితే తాజాగా చంద్రయ్య అంత్యక్రియ కార్యక్రమాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రయ్య ఇంటి వద్దకు చేరుకొని,అంతిమ యాత్రలో కార్యకర్త పాడెను స్వయంగా మోశారు చంద్రబాబు నాయుడు.

ఈరోజు ఉదయం గ్రామ సెంటర్ లో కూర్చోని ఉన్న సమయంలో అత్యంత కిరాతకంగా ప్రత్యర్థులు నరికారు. హత్య చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు. ఘటన తెలిసిన తరువాత హుటాహుటీన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి” అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news