ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించాం : చంద్రబాబు

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిన్న గుజరాత్‌లో 36వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్‌ చేశారు. అయితే.. 2002లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు చంద్రబాబు. నాడు హైదరాబాద్ తో పాటు విశాఖను కూడా క్రీడావేదికగా చేశామని వివరించారు చంద్రబాబు. ఒంగోలు గిత్తను ‘వీర’ పేరుతో జాతీయ క్రీడల మస్కట్ గా పెట్టామని తెలిపారు చంద్రబాబు.

Andhra Pradesh: Chandrababu Naidu clarifies on Atmakur bypoll

ఈ జాతీయ క్రీడల ద్వారా దేశం దృష్టిని ఆకర్షించామని పేర్కొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా దేశానికే తలమానికంగా ఉండేలా హైదరాబాద్ లో పలు స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు. “నాటి జాతీయ క్రీడల నిర్వహణతో ప్రజల్లో క్రీడాభిలాషను కలిగించి, అనేకమంది క్రీడలను తమ జీవిత లక్ష్యంగా ఎంచుకునే వాతావరణం కల్పించాం అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తాను” అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news