వివేకాను హత్య చేసి ఊసరవెల్లిని మించి వేషాలు వేశారు : చంద్రబాబు

-

వివేకా హత్య కేసులో అసలు దోషి జగనే అని CBI అఫిడవిట్ తో తేలి పోయిందన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వివేకా హత్య కేసు లో సిబిఐ అఫిడవిట్ లో అసలు విషయాలు చెప్పారని, వివేకాను హత్య చేసి ఊసరవెల్లిని మించి వేషాలు వేశారన్నారు. అంతేకాకుండా.. ‘ఇప్పటి వరకు వివేకా హత్య లో రోజుకో మాయ మాట చెప్పారని తేలిపోయింది. నాడు వీళ్లు హత్య చేసి నాపై నెపం వేసి…నారా సుర రక్త చరిత్ర అని రాశారు. ఎన్నికల్లో లబ్దిపొందారు. వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు. వివేకా హత్య విషయం బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్ కు తెలుసని సిబిఐ స్వయంగా చెప్పింది.

హత్యలు చేసే వ్యక్తిని..హత్యలు చేయించే వ్యక్తిని సిఎంగా పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్ ఏమవుతుంది? సొంత పత్రిక, టీవీలను అడ్డుపెట్టుకుని ఇప్పటివరకు బుదర జల్లారు. ఇప్పుడు దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలకు జగన్ సమాధానం చెప్పాలి. హత్యకు ముందు…హత్య తరువాత నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయాలు అవినాష్ రెడ్డి ప్రతి నిముషం జగన్ కు వివరించాడు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు జగన్ మోహన్ రెడ్డే అని సిబిఐ పేర్కొంది. హత్యకు సంబంధించి ప్రతి ఉదంతం జగన్ కు తెలిసే జరిగింది అని కూడా సిబిఐ చెప్పింది. ఈ అన్ని ప్రశ్నలకు, పరిణామాలకు జగన్ సమాధానం చెప్పాలి?.’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version