ఏపీ విభజన‌ కంటే.. సైకో‌ జగన్ వల్లనే ఏపీకి ఎక్కువ నష్టం – చంద్రబాబు

-

ఏపీ విభజన‌ కంటే.. సైకో‌ జగన్ వల్లనే ఏపీకి ఎక్కువ నష్టం అని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేయటానికే జగన్ పుట్టాడు.. ముఖ్యమంత్రే రాజధాని అమరావతిని సర్వనాశనం చేయటం బాధాకరమన్నారు చంద్రబాబు. రాష్ట్ర విభజన‌ కంటే సైకో‌ సీఎం జగన్ వల‌నే ఏపీకి ఎక్కువ నష్టమని ఫైర్‌ అయ్యారు.

పులివెందులలో గన్ కల్చర్ పై జగన్ సమాధానం చెప్పాలి.. గొడ్డలి, గంజాయి కల్చర్ కు జగన్ కారణమని మండిపడ్డారు జగన్‌. ఏపీలో జగన్ సర్కార్ పై తిరుగుబాటు ప్రారంభమైందని… ఏపీ పునర్నిర్మాణం కోసం టీడీపీ అధికారంలోకి రాబోతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు… హైదరాబాద్ మెట్రోను వైఎస్ పక్కన పెడితే.. రోశయ్య గాడిలో పెట్టారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news