వచ్చేవి చంద్రబాబుకు చివరి ఎన్నికలు – సీఎం జగన్

-

వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు అన్నారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. నేడు విజయవాడలో జరిగిన జయహో బీసీ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టిడిపి సామాజిక అన్యాయాల పార్టీ అని ధ్వజమెత్తారు. బీసీలకు మంచి చేస్తుంటే టిడిపి అడ్డుకుంటుందని, పెత్తందారీ చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధిలో చెప్పాలని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టులలో కేసులు వేస్తున్నారని అన్నారు.

వచ్చే 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలని జోష్యం చెప్పారు సీఎం జగన్. మరో 18 నెలలలో మంచికి, చెడుకు యుద్ధం జరగబోతుందన్నారు. టిడిపి హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలు వైసీపీకి దగ్గరవుతున్నారని, బీసీలు రాజకీయ సాధికారతకు నిదర్శనంగా నిలిచారని విజయవాడలో జరిగిన జయహో బీసీ సభలో జగన్ వెల్లడించారు. బీసీల హృదయంలో జగన్.. జగన్ హృదయంలో బీసీలు ఉన్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news