మెంబర్ షిప్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలి – చంద్రబాబు

-

టీడీపీ మెంబర్ షిప్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం పార్టీతో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం… గ్రామ స్థాయిలో అన్ని కమిటీల్లో యువత అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణమన్నారని చెప్పారు. కుటంబంతో కలిసి తిరుమల వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా లాకోడమే కాకుండా…ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం దారుణమని చెప్పారు.

ఈ విషయం లో బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి…. నోటీసులతో వేధిస్తారా? అని అగ్రహించారు.పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది..? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెకుని నాశనం చేశారు… డయాఫ్రం వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా.. టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news