వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరిచిపోయేలా చేస్తాం – రామచంద్రారెడ్డి

-

అనంతపురం : వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరువాత జిల్లా కాపు రామ చంద్రారెడ్డి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు భారీ ర్యాలీతో స్వాగతం పలిపారు అభిమానులు. నగరంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాలలు వేశారు కాపు రామచంద్రారెడ్డి.

ఈ సందరభనగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 8 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని మరిచిపోయేలా చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ని భూస్థాపితం చేయడానికి ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లుతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news