జంగారెడ్డి గూడెం బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున చంద్రబాబు ఆర్థిక సాయం

-

జంగారెడ్డి గూడెం లో కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించిన నారా చంద్రబాబు నాయుడు.. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున పార్టీ నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నాడు గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పిన జగన్ …నేడు సారా మరణాలను సహజ మరణాలు అంటున్నారని ఫైర్ అయ్యారు.

సిగ్గు లేకుండా మరణాల ను దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. 26 మంది చనిపోయారు….మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్నారు. నేను చేసేవి ప్రజా రాజకీయాలు… వివేకా హత్య లో నాపై నిందలు వేశారు….అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు చెప్పిన మధ్య పాన నిషేధం ఏమయ్యింది ? అని నిలదీశారు నారా చంద్రబాబు నాయుడు. సొంత బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా? మద్యం రెట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదు … చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిందని నిప్పులు చెరిగారు నారా చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news