BREAKING : కరోనా నుంచి కోలుకున్న చంద్రబాబు

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ నెల 18 వ తేదీన చంద్రబాబు నాయుడుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తన నివాసంలో హోం ఐసోలేషనులో ఉంటూ కోవిడ్ నుంచి కోలుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలు కోవడంతో… పార్టీ పై దృష్టి సారించారు చంద్రబాబు నాయుడు.

chandrababu
chandrababu

ఇందులో భాగంగానే.. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రబాబుతో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, ముఖ్యనేతలు. కమిటీ నివేదిక, తదుపరి కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చ జరుగనుంది. కాగా.. గత నాలుగు రోజుల నుంచి గుడివాడ క్యాసినో వ్యవహారం పై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడే క్కాయి. క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. తాము నిర్వహించలేదని కొడాలి నాని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే నిన్న బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్టు కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news