టీడీపీ భవిష్యత్తు రథ సారథి ఇతనే .. తోపు లాంటి వ్యక్తిని రంగంలోకి దింపుతున్న చంద్రబాబు నాయుడు ?

-

తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన ఫలితాలు టిడిపి ని చావు దెబ్బ కొట్టినట్లయింది. దీంతో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పార్టీని నడిపించడానికి శతవిధాల కృషి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఇరవై మూడు స్థానాలకు ప్రతిపక్షనికి టీడీపీ పడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పెద్దగా చంద్రబాబు ఇస్తున్న ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు ప్రస్తుతం కనబడటం లేదు. Image result for chandrababu jr ntr

మరోపక్క జగన్ దూకుడుగా రాజకీయాలు చేస్తూ టిడిపిని ఇబ్బంది పెట్టడానికి శతవిధాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కానీ చంద్రబాబు మాత్రం తన చాణిక్య రాజకీయంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో టీడీపీ భవిష్యత్తు రథసారధిగా జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దించడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

 

వాస్తవానికి 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ తరపున ప్రచార కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. ఆ తర్వాత పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే కనుమరుగైపోయిన టిడిపి ఆంధ్రాలో కూడా అటువంటి పరిస్థితి కి వస్తుందేమో అన్న భావనతో ముందుగానే తేరుకుని జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పగ్గాలు అప్పగించడానికి బాబు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి పార్టీలో వినబడుతున్న టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news