బ్రేకింగ్‌ : ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

-

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కర్ఫ్యూ సడలింపులు చేస్తూ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7 వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. అ తర్వాతి నుంచి కొత్త ఆంక్షలు అమల్లో రానున్నాయి. దీని ప్రకారం.. తూ.గో, ప.గో జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది సర్కార్‌. అలాగే  సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఈ రెండు జిల్లాల్లో ఆంక్షల కొనసాగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకూ సడలింపులు ఇచ్చింది ఏపీ సర్కార్‌. ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే… రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3175 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1900028 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 29 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 12844 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35, 325 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news