BREAKING : కాంగ్రెస్ లో చేరిన చెరుకు సుధాకర్

-

BREAKING : కాంగ్రెస్ పార్టీ లో చెరుకు సుధాకర్ చేరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు చెరుకు సుధాకర్. అంతేకాదు.. తన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు చెరుకు సుధాకర్. ఈ కార్య‌క్ర‌మంలో చెరుకు సుధాక‌ర్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు నాయ‌కులు బ‌త్తుల సోమ‌య్య‌, సందీప్ చ‌మార్, కాంగ్రెస్ నాయ‌కుడు స‌త్తు మ‌ల్లేష్ పాల్గొన్నారు.

ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆరెస్ ఏర్పాడ్డాక పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశానని.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను బలపరిచామని వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీని, కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కారుల కోసం త్వరలో పిసిసి కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు చెరుకు సుధాకర్.

Read more RELATED
Recommended to you

Latest news