ఆయన పేరు మార్చడం వల్ల వైద్య సౌకర్యాలు ఏమన్నా ఎక్కువయ్యాయా : చింత మోహన్

-

ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చుతున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. తాజాగా దీనిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. పేర్లలో ఏముందని ప్రశ్నించారు. ఓ బ్యారేజి ప్రారంభించి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుకు పేరు పెట్టారు, అంతకుమించి ఏమీ లేదు అని అన్నారు చింతా మోహన్. ఇక, ఎన్టీ రామారావు గొప్ప నటుడు, పెద్ద మనిషి, మంచి లీడర్ అని, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టారని చింతా మోహన్ వివరించారు.

 

Andhra Pradesh: Chinta Mohan assures to make Venkatagiri State capital

“ఆ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ఎందుకు బంగారూ… ఆయన పేరు మార్చడం వల్ల వైద్య సౌకర్యాలు ఏమన్నా ఎక్కువయ్యాయా! మీ నాన్న పేరు పెట్టుకోవడం ఎందుకు? మీ నాన్న భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కు చేసిన త్యాగాలు ఏమైనా ఉన్నాయా? ఆయనేమైనా కష్టపడి డాక్టర్ చదివాడా? పక్కనే తమిళనాడులో ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. కరుణానిధి అధికారంలోకి రాగానే ఎంజీఆర్ పేరు తీసెయ్యలేదే! స్టాలిన్ అధికారంలోకి రాగానే ఎంజీఆర్ పేరు తీసేసి తన తండ్రి కరుణానిధి పేరు పెట్టుకోలేదే!

ఎందుకయ్యా… ఎన్టీఆర్ పేరు తీసేసి మీ తండ్రి పేరు పెట్టావు? మీరు ఏంచేశారని ఆ నిర్ణయం తీసుకున్నారు? ఈ మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ చేసింది ఏమీ లేదు. దగా తప్ప నిర్మాణాత్మకంగా మీ ప్రభుత్వం చేసింది సున్నా. ఇంకో విషయం కూడా అడుగుతున్నా…. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఎందుకయ్యా! నీకిది ఎవరు నేర్పించారయ్యా! నిద్రపోతున్న జర్నలిస్టు అంకబాబును ఎత్తుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటయ్యా! జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నావు, ఎంపీలను అరెస్ట్ చేస్తున్నావు, నీ చేతుల్లో పోలీసులు ఉన్నారు కదా అని నోరు విప్పినోళ్లందరినీ అరెస్ట్ చేస్తున్నావు. రేపు నీ పరిస్థితి ఏంటి?” అంటూ చింతా మోహన్ ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news