కృష్ణంరాజు మృతి పట్ల ఎమోషనల్ అయిన చిరంజీవి

-

ప్రముఖ నటుడు, రెబల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఇక లేరన్న వార్త అభిమానులను కలచివేసింది. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు చివరి శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం మధ్యాహ్నము అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులతోపాటు పలువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియజేశారు.

” శ్రీ కృష్ణం రాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ” మన ఊరి పాండవులు” దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు లాంటి ప్రభాస్ కి, నా సంతాపం తెలియజేస్తున్నాను”. అంటూ ఎమోషనల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news