BREAKING NEWS: ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్ పడింది: చిరంజీవి

-

ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్ పండిందని చెప్పడానికి సంతోషిస్తున్నాని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సినిమా ప్రముఖులు సమావేశం అనంతరం మీడియాలో చిరంజీవి మాట్లాడారు. ఈ చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. టికెట్ ధరలపై కొన్ని నెలులగా ఏర్పడిన అనిశ్చితికి తెర పడిందని వెల్లడించారు. ఏపీలో చిన్న సినిమాాలకు ఐదో షోకు అంగీకారం తెలిపారని చిరంజీవి అన్నారు. చిన్న సినిమాకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఇటు ప్రజలకు, అటు చిత్ర పరిశ్రమకు మేలు కలిగేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని సంత్రుప్తి పరిచిందన్నారు. భారత దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాలను కీర్తిస్తున్నారని.. హై బడ్జెట్ సినిమాలు వస్తున్నాయని.. వాటిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పడం హామీ ఇచ్చారని అన్నారు. సినిమారంగ సమస్యలు తీర్చేలా చొరవ చూపిన మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు చిరంజీవి. తెలంగాణలో లాగే ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రీని అభివ్రుద్ది పరచాలని.. దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తానని వెల్లడించారు. అందమైన సిటీ వైజాగ్ ను సినిమా పరిశ్రమకు, షూటింగ్ కు అనుకూలంగా రూపొందిస్తానిని సీఎం అన్నారని.. రెండు రాష్ట్రాల్లో సమంగా సినిమా పరిశ్రమ అభివ్రుద్ది చెందాలని కోరుకుంటున్నామని చిరంజీవి అన్నారు. ఈ నెల మూడో వారంలోగా జీవో వచ్చే అవకాశం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news