ఆగస్టు 4న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

-

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ అని మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు వెల్లడించారు. బెస్ కమాండ్ కంట్రోల్ తెలంగాణలో ఉందని, కేసీఆర్ హయాంలో ప్రజలు సెక్యూర్టీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ను వారు పరిశీలించారు. వారితో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్, పోలీసు ఉన్నతాధికారులున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ…తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నా్యని, సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ కమాండ్ కంట్రోల్ పని చేస్తుందన్నారు. ప్రజల భద్రతలో ఇది ల్యాండ్ మార్క్ అని మంత్రి తలసాని తెలిపారు. సభలు, ప్రమాదాలు, రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి పోలీస్ లు అక్కడికి సత్వరం చేరుకునేలా పని చేస్తుందన్నారు మంత్రి తలసాని. దేశానికే ఇది మణిహారమని, దేశంలో మనదే బెస్ట్ లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రమన్నారు. అన్ని అత్యవసర శాఖలను అనుసంధానం చేస్తూ..మానిటరింగ్ ఉంటదన్నారు.

Image

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు మంత్రి తలసాని. పనులు చకచకా పూర్తవుతున్నాయి. 14వ ఫ్లోర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవలే వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్​ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీపీ సీవీ ఆనంద్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వందల మంది కార్మికులతో ఎంట్రెన్స్ దగ్గర ఉన్న రోడ్డు మీద చెట్లు తొలగించి కాంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటుతున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అన్ని పనులు ఆగస్టు 2వ తేదీ సాయంత్రం కల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news