దటీజ్‌ జగన్‌.. కాన్వాయ్‌ ఆపి బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌

-

ఏపీ సీఎం జగన్‌ మరోసారి గొప్ప మనుసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్‌ నుంచి బాధితులను గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌ వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు.  ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు(7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను సీఎం జగన్‌కు వారు వివరించారు. దీంతో, తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌.. ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, చిన్నారి పేరెంట్స్‌ జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు.

CM Jagan: నరసన్నపేట పర్యటనలో సీఎం జగన్ ఉదారత - NTV Telugu

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌.. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news