దివంగత మేకపాటి గౌతంరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

-

చిరస్మరణీయుడు, దివంగత మేకపాటి గౌతమ్‌ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి “చిరస్మరణీయుడు” అనే పుస్తకాన్ని రచించారు.

పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి, రచయిత డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news