ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు : సీఎం జగన్‌

-

గృహనిర్మాణశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గృహనిర్మాణశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.5,655 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు సీఎం జగన్. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధరణ పరీక్షలు జరగాలన్నారు సీఎం జగన్. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించేలా ఆప్షన్‌–3ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేసేలా దృష్టిపెట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు. లే అవుట్ల వారీగా, ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు.

Andhra Pradesh: CM YS Jagan Mohan Reddy announces hike in old age pensions

ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని సూచించారు సీఎం జగన్. వారి సేవలనూ విసృత్తంగా వాడుకోవాలి: ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధరణ పరీక్షలు జరగాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్‌ఓపీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను విస్తృతంగా వాడుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ భాగస్వామ్యం తీసుకోవాలన్నారు సీఎం జగన్.
ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.5,655 కోట్లు ఖర్చు చేశాం.ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. లే అవుట్లు సందర్శించినట్లు ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తికావాలి అని సీఎం జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news