చంద్రబాబు ఉచ్చులో పవన్ అంటున్న మంత్రి రోజా

-

ఏపీ మంత్రి రోజా చంద్రబాబు ఉచ్చులో పవన్ కల్యాణ్ అంటూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో పవన్ కల్యాణ్ ను వాడుకున్న చంద్రబాబు… ఇప్పటంలో తెలివిగా పవన్ ను ఇరికించాడని రోజా ఆరోపించారు. ఇప్పటం ఉన్నది మంగళగిరి నియోజకవర్గంలో కాగా, ఇక్కడ పోటీ చేసేది చంద్రబాబు కొడుకు లోకేశ్ అని, కానీ ఇప్పటం గ్రామానికి పవన్ వెళ్లి ఇరుక్కుపోయాడని వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై విషం చిమ్మి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Opposition has no moral right to speak on women's safety: RK Roja

చంద్రబాబు, పవన్ చేస్తున్నవి దిగజారుడు రాజకీయాలని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని రోజా వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుదని, పవన్ కల్యాణ్ ను కూడా అలాగే వాడుకుని వదిలేస్తాడని రోజా విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని పవన్, చంద్రబాబు ఉచ్చులో చిక్కుకోకుండా వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు ఏపీ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి రోజా.

 

 

Read more RELATED
Recommended to you

Latest news