ఎల్లుండి ఎంపీలతో ఢిల్లీకి జగన్… కేసీఆర్ పై ఫిర్యాదుకేనా !

-

అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోజు రోజు కు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రేపు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైసీపీ ఎంపీలతో సమావేశం కానున్నారు జగన్. ఈ సమావేశంలో కృష్ణా జలాల వివాదం, ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలపై ఎంపీ లతో దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌.

అంతేకాదు.. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహారంపై ఎంపీలతో చర్చించి..ఎల్లుండి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత రేపు సాయంత్రం ఎంపీలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం మూడు గంటలకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి తో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news