సంక్షేమ పథకాలు అందని వారి ఖాతాల్లో డబ్బులు వేసిన జగన్

-

ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అర్హులైనప్పటికీ ఏ కారణంతో నైనా లబ్ధి పొందని వారికి సీఎం జగన్ మరో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2.79 లక్షల  మంది ఖాతాలో 590 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

వసతి దీవెన, అమ్మ ఒడి, వాహన మిత్ర, వైయస్సార్ ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైయస్సార్ కాపు నేస్తం, వైయస్సార్ నేతన్న హస్తం లాంటి తదితర పథకాల కింద లబ్ధిదారులకు ఈ నిధులను విడుదల చేశారు సీఎం జగన్. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు. గతంలో ఇలాంటి పథకాలు ఏ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news