పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి : సీఎం జగన్

-

పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాజాగా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అంబాజీ పేటలో నిర్వహించిన  ప్రఛార బేరీలో జగన్ మాట్లాడారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. జగన్ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. మీ అందరికీ మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మోసాల చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరందరి కుట్రలు, కుతంత్రలు.. వీరందరికీ తోడు నోటాకు వచ్చినన్ని ఓట్లు రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్.. వీరంతా జగన్ ని ఓడించాలనుకుంటున్నారు.

కానీ మీ జగన్ పేదల పెన్నిది. ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు. జగన్ ను ఎందుకు ఓడించాలి..? అని అడుగుతున్నాను. పేదలకు మంచి చేసినందుకు జగన్ ను ఓడించాలా..? అని ప్రశ్నించారు.చంద్రబాబుకు అధికారం రావడం కోసమా..? వీరంతా దోచుకొని పంచుకోవడం కోసమా..? జగన్ ఓడించేది అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news