నేడు విశాఖకు సీఎం జగన్.. 28 కి.మీటర్ల బీచ్ శుభ్రత కార్యక్రమం!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:55 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. అయితే విశాఖ బీచ్ పరిరక్షణ కోసం అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ పార్లే ఫర్ ది ఓషన్స్ తో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నేతృత్వంలో బీచ్ పరిశుభ్రత కార్యక్రమం జరగనుంది.

విశాఖ బీచ్
విశాఖ బీచ్

విశాఖ బీచ్ శుభ్రత కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది పాల్గొననున్నారు. దాదాపు 28 కిలో మీటర్ల వరకు బీచ్‌ను శుభ్రం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆయా స్వచ్ఛంద సంస్థలు హాజరుకానున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ఇటీవల మెక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన గ్రాడ్యుయేట్లకు ధ్రువపత్రాలు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news